శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గవర్నర్ తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.