కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్లో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకున్నా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పేలుడు ధాటికి స్టేషన్ లో ఆవరణలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. హుస్సేన్ పట్టుకెళ్తున్న బాక్స్ పేలి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలిన బాక్స్ కాన్పూర్ ఎమ్మెల్యే పేరుతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న బాంబు స్కాడ్ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అకస్మాత్తుగా తక్కువ స్థాయిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్లోని జనాలకు ముచ్చెమటలు పట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.