telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

త్వరలో వార్డు సేవకుల నియామకం: మంత్రి బొత్స

మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ల వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సేవకులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చించడమే ఈ వర్క్‌షాప్‌ ఉద్దేశమని పేర్కొన్నారు.

త్వరలో వార్డు సేవకులను ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Related posts