ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో చేస్తున్న విమర్శలపై వైసీపీ నేత కిల్లీ కృపారాణి మండిపడ్డారు. జగన్ను రాజీనామా చేయాలని అడిగే అర్హత లోకేష్కు లేదని ఆమె చెప్పారు. మాట మార్చడం, మడమ తిప్పడం చంద్రబాబుకే అలవాటని విమర్శించారు. విభజన హామీల సాధనకు వైసీపీ మొదటినుంచి పోరాటం చేస్తోందన్నారు. కేంద్రబడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ను విమర్శిస్తూ లోకేష్ వరుసగా ట్వీట్లు చేయడం బాధాకరమని కృపారాణి పేర్కొన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు