తీహార్ జైలులో నిర్బయ దోషులకు అధికారులు ఆంక్షలు విధించారు. దోషులు నలుగురు ఒకరినొకరు కలుసుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్సింగ్లు ఇప్పటి వరకు జైలులో ఉదయం వేళ ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేవారు. అయితే, ఉరితీత సమయం దగ్గర పడుతుండడంతో వారు కలుసుకుని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు.
మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. మరో రెండు రోజుల్లో ఉరికి సిద్ధమవుతున్న దోషుల కోసం జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు.
జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్