telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాకలో ఆధిక్యంలో బీజేపీ సర్‌ప్రైజ్ విక్టరీ

తెలంగాణలో ఏంతో ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కౌంటింగ్ కొనసాగనుంది. ఒంటిగంటకల్లా పూర్తి ఫలితం రానుంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్లు లక్షా 98 వేల 766 మంది ఓటర్లు ఉండగా, లక్షా 64 వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ దూసుకుపోతుంది. అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేత రామ్ మాధవ్ స్పందించారు. ఇది బీజేపీ కి సర్ ప్రైజ్ విక్టరీ కాబోతున్నాడని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. “దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. బీజేపీ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. బీజేపీ కి ఇది సర్ ప్రైజ్ విక్టరీ ” అంటూ ట్వీట్ చేసాడు రామ్ మాధవ్.

Related posts