పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 9 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ను కాదని వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ను ఫస్ట్ డౌన్లో పంపిస్తూ ముంబై ఇండియన్స్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అయితే ఈ వ్యూహం వెనుక ఉన్న కారణాన్ని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టులోని తన రోల్పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇషాన్ను ఫస్ట్ డౌన్లో పంపించడం లెఫ్ట్, రైట్ కాంబినేషన్లో భాగంగా టీమ్మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం. లెఫ్టాండర్ ఔటైతే మరో లెఫ్టాండర్ బరిలోకి దిగాలని మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా ఇషాన్, నేను టీమ్లో ఒకే తరహా పాత్రను పోషిస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయానికి నేను పూర్తి అంగీకారం తెలిపాను. మా ప్రణాళికల పట్ల మేం చాలా క్లారిటీతోఉన్నాం’అని సూర్య చెప్పుకొచ్చాడు. నెట్స్లో ప్రతీ ఒక్కరు బంతిని బలంగా బాదుతున్నారు. అందరూసానుకూల దృక్పథంతోనే ఉన్నారు. కానీ వారిని వారు ఎక్స్ప్రెస్ చేసుకునే విధానంపైనే వారి పెర్ఫామెన్స్ ఆధారాపడి ఉంది. చెన్నైలో ఏం జరిగిందనేదాన్ని మేం ఎక్కువగా ఆలోచించం. ఇప్పుడు ముంబై ఢిల్లీకి వెళ్తుంది. అక్కడ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి’ అని సూర్య అన్నాడు.
previous post
next post
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…