ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆకాశానికి ఎత్తేశారు నాగబాబు. ‘ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది. దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు. ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశంలో కేసీఆర్ లాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు.’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే, కేసీఆర్ మీద పొగడ్తలు కురిపించిన నాగబాబు పరోక్షంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద సెటైర్లు వేశారనేది ఆయనకే తెలియాలి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నాగబాబు ట్విట్టర్ వేదికగా కొన్ని రోజుల క్రితం విపరీతంగా విమర్శలు గుప్పించుకున్నారు.
ఈ మధ్య కేసీ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశం కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు. pic.twitter.com/EgEphmY76l
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 15, 2020