telugu navyamedia
సినిమా వార్తలు

ముంబైలో ప్రభాస్ “సాహో”… రజినీకాంత్ “దర్బార్”

Saaho

త‌మిళ సూప‌ర్ స్టార్, టాలీవుడ్ రెబ‌ల్ స్టార్… వీరిద్ద‌రి చిత్రాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. ప్ర‌స్తుతం వీరిరివురి చిత్ర షూటింగ్స్ ముంబైలోనే జ‌రుపుకుంటుండ‌డం విశేషం. “పేటా” సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం “ద‌ర్భార్”. ర‌జ‌నీ 167వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ముంబై నేప‌థ్యంలో సాగనున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుపుతున్నారు. “చంద్రముఖి, కుశలన్‌ చిత్రాల తరువాత ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌య‌నతార “ద‌ర్భార్” చిత్రంలో న‌టిస్తుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇక బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ “సాహో”. స్పై థ్రిల్ల‌ర్‌గా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ చిత్రానికి పని చేస్తుండ‌గా… ఈ చిత్రానికి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Related posts