తమిళ సూపర్ స్టార్, టాలీవుడ్ రెబల్ స్టార్… వీరిద్దరి చిత్రాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం వీరిరివురి చిత్ర షూటింగ్స్ ముంబైలోనే జరుపుకుంటుండడం విశేషం. “పేటా” సినిమా తర్వాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రం “దర్భార్”. రజనీ 167వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ముంబై నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుపుతున్నారు. “చంద్రముఖి, కుశలన్ చిత్రాల తరువాత రజనీకాంత్తో కలిసి నయనతార “దర్భార్” చిత్రంలో నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో”. స్పై థ్రిల్లర్గా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ చిత్రానికి పని చేస్తుండగా… ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది. ఆ తర్వాత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.