telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న డైరెక్టర్ దేవా కట్టా, సింగర్ స్మిత

Green-INdia

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో భాగంగా… డైరెక్టర్ దేవా కట్టా, సింగర్ స్మిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో ఈ ఇద్దరు మూడు మొక్కలు నాటారు. అనంతరం దేవా కట్టా మరో ముగ్గురు హీరో సాయి ధరమ్ తేజ్ , హీరోయిన్ నివేదా , సింగర్ స్మిత తల్లి జోగులంబాకు ఈ ఛాలెంజ్ విసురుతున్నట్లు చెప్పారు. తర్వాత సింగర్ స్మిత కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ సీతక్క, టిడిపి నాయకులు నారా లోకేష్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సినీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా కో.ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Related posts