తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ జారీ చేసిన నోటీసులపై తాజాగా రాపిడో సంస్థ దిగివచ్చింది. ఆర్టీసీ బస్సు ఎక్కితే మసాలా దోశలా నలిగిపోతావ్.. రాపిడో బుక్ చేసుకో సింపుల్గా పోతావ్.. తొందరగా ఎక్కెయ్ అనేది అల్లు అర్జున్ చేసిన యాడ్. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ డైలాగ్స్ చెప్తాడు. ఆర్టీసీ బస్సును కించపరస్తూ యాడ్లో నటించిన అల్లు అల్లు అర్జున్తో పాటు ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఆర్టీసీ బస్సు సన్నివేశాన్ని తొలగించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు.
దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన రాపిడో అల్లు అర్జున్ యాడ్ నుండి ఆర్టీసీ బస్సు సన్నివేశాలను తొలగించింది. అంతే కాదు.. తెలంగాణ ఆర్టీసీ కి రాపిడో క్షమాపణలు చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేసింది రాపిడో. ఆర్టీసీ ప్రతిష్టలను కాపేడుందుకు సజ్జనార్ తీసుకున్న నిర్ణయాన్నిసోషల్ మీడియాలో ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.