బుల్లితెర కామెడీ షో “పటాస్”తో యాంకర్ రవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ యాంకర్ గా దూసుకెళ్తున్నారు. పలు టీవీ షోస్ చేస్తూనే అడపదడపా సినిమాలలో నటిస్తున్నాడు. ఈ షో ప్రస్తుతం సెకండ్ సీజన్ జరుపుకుంటోంది. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్లో మహిదర్ అనే వ్యక్తి ఏపీ ప్రజలని కించ పరిచే విధంగా కామెంట్ చేశాడు. ఆ సమయంలో యాంకర్ రవి క్లాప్స్ కొడుతూ స్టేజ్పైకి వెళ్ళాడు. అప్పుడు రవి ప్రవర్తన మహిధర్ చేసిన కామెంట్స్ని ప్రొత్సహించేలా ఉందని భావించిన ఏపీ ప్రజలు ఆయనని తిట్టి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి ట్విట్టర్లో వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. “మొన్న 23వ తారీఖున పటాస్లో మహిధర్ చేసిన కామెంట్స్ తప్పు అని నేను, పటాస్ ఒప్పుకుంటుంది . ‘మహిధర్’ క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ సమయంలో నేను అతడిని సపోర్ట్ చేయలేదు. యాంకర్గా అక్కడ ఎవరు ఉన్నా అలానే ప్రవర్తిస్తారు. ఇలాంటి వివాదాలలో దయచేసి నన్ను లాగొద్దు. కాంట్రవర్సీలు రావడం, వాటికి వీడియోల ద్వారా వివరణ ఇవ్వడం నాకు కామన్ అయిపోయింది. నేను తెలుగు వాడిని. నాకు ఎపీ సీఎం జగన్ అంటే ఎంతో ఇష్టం. వారి ఫ్యామిలీతో కూడా మాట్లాడాను. మరో నెల రోజులలో శ్రీ జగన్ని కలవబోతున్నాను. నేను సారీ చెప్పాలని అందరు అంటున్నారు. నేను తప్పు చేయలేదు. ఆ స్టేట్మెంట్ని మాత్రం నేను సపోర్ట్ చేయను” అంటూ యాంకర్ రవి వీడియోలో పేర్కొన్నాడు.
I love my India, I love my 2 Telugu states!
Dont find my mistake…try understanding! pic.twitter.com/GgEsA0e2xS— Anchor Ravi (@anchorravi_offl) June 15, 2019
ఆ నర్స్ ను బాగా వాడేసి వదిలేశావ్… గుర్తుందా ?… తేజపై శ్రీరెడ్డిపై తేజ సంచలన ఆరోపణలు