కరోనా లాక్ డౌన్ సమయం నుండి మానవత్వానికి మరు పేరుగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోమారు సాయం అందించి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు 15 నెలల కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో చికిత్స చేయించలేని పరిస్థితుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. ముంబైలోని ఆస్పత్రిలో సర్జరీ చేయడానికి అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి కృష్ణా జిల్లాకు చేరుకుంది. సోనూసూద్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాజాగా సోనూసూద్ ‘ఆచార్య’ సినిమా కోసం పనిచేస్తున్న సిబ్బందికి సోనూసూద్ 100 స్మార్ట్ఫోన్లు అందజేశాడు. ఈ సినిమా కోసం పనిచేసిన సిబ్బంది చాలా బీదరికంలో ఉన్నవారని, కనీసం వారి పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కూడా వినియోగించే పరిస్థితిలో లేరని గ్రహించాడు సోనూసూద్. వెంటనే ఆచార్య యూనిట్ మెంబర్స్ కు 100 స్మార్ట్ ఫోన్లను సోనూసూద్ అందించాడు.
previous post
next post
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నాగబాబు వ్యాఖ్యలు