కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ మృతి చెందారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. బ్రిటిష్కు చెందిన హిల్లరీ ముఖేల్ రీవ్స్ హర్రర్ చిత్రం ‘విచ్ ఫైండర్ జనరల్’తో నటిగా పరిచయయ్యారు. ఇక 1995లో వచ్చిన ‘హ్యూ గ్రాంట్’, ‘ఆన్ ఆవ్ఫుల్లీ బిగ్ అడ్వెంచర్’, ‘గ్యారీ ఓల్డమన్స్ నిల్ బై మౌత్’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్వవహరించారు. కాగా కరోనా కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో హీత్ మృతి చెందినట్లు హాలీవుడ్ సీనీ ప్రముఖులు శనివారం అధికారంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నటి దత్త కుమారుడు అలెక్స్ ఫేస్బుక్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
previous post