రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాజీ ఎన్నికల కమిషనర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. తన పదవీకాల పరిమితి కుదింపు, తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఈ రోజు ఏపీ ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం ఎస్ఈసీగా కనగరాజు నియమితులయ్యారు. ఈయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తొమ్మిది ఏళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.అంతేకాకుండా తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్గా ఆయన వ్యవహరించారు.