ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నంల సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రి అమ్ముకునే ఓ దుకాణంలోకి దూరి హల్చల్ చేసింది. అక్కడి అల్మరాలో దాక్కొని కాసేపు షాపు యజమాని, స్థానిక భక్తులను భయపెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పాములు పట్టే ఉద్యోగి కిరణ్కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అతడు చాకచక్యంగా పామును పట్టుకుని బంధించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడు గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భజనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది ఓ నాగుపాము.
అయ్యప్ప స్వాములు చేస్తున్న భజన కీర్తనలు వింటూ పైన ఏర్పాటు చేసిన దేవతామూర్తల చిత్రపటం వద్దకు చేరుకొని పడగ విప్పి భజన పూర్తి అయ్యేంతవరకూ అక్కడే ఉండిపోయింది. పూజ అనంతరం అయ్యప్ప స్వాములు దగ్గరలో ఉన్న పొదల్లోకి నాగు పామును పంపేశారు.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే