telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దెబ్బతిన్నా తిరిగి లేచి నిలబడతా: పవన్

pawan-kalyan

అంతిమ లక్ష్యం కోసం అడుగులు వేసుకుంటూ వెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘోర ఓటమి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తున్నానని, దెబ్బతిన్నా తిరిగి లేచి నిలబడతానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ, ఒక్క ఎమ్మెల్యే ఉన్న తమ పార్టీపై విమర్శలు చేస్తోందని దీన్ని బట్టే తమకు రాష్ట్రంలో ఎంతగా బలం ఉందో తెలుస్తోందని అన్నారు.

తమ పోరాటంపై ఎంతగా ప్రతి స్పందన వస్తుందో తెలుసుకోవచ్చని అన్నారు. వెన్నుపోట్లు, కుట్రలతో నిండిపోయిన రాజకీయాలు సమాజంలో ఉన్నాయి. ఇటువంటి సమాజంలో మనం బలంగా ఉండాలి. అంతేగానీ, వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. పార్టీలో చేరతామని వచ్చే వ్యక్తులు నిస్వార్థంగా ఉంటారని అనుకోవడం పొరపాటే అవుతుంది. అటువంటి వ్యక్తులు ఉంటారని తెలుసు. ఇటువంటివి చూసే నేను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

Related posts