telugu navyamedia
సినిమా వార్తలు

బికినీలో జాన్వీ కపూర్ ?

Jahnavi-Kapoor

శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హిట్ సినిమా సీక్వెల్‌ “దోస్తానా 2″లో నటించనుంది. ఈ విషయానికి సంబంధించి ఇటీవలే స్పెషల్ గా ప్రకటించారు నిర్మాత కరణ్ జోహార్. 2008లో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ “దోస్తానా” అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రియాంక చోప్రా, అభిషేక్ బ‌చ్చ‌న్‌, జాన్ అబ్ర‌హం ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. సీక్వెల్ ద్వారా కొలిన్ డి. కున్హా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పుడు సీక్వెల్‌లో ప్రియాంక స్థానంలో జాన్వీక‌పూర్ న‌టిస్తున్నారు. ఇక ఇద్ద‌రు హీరోస్‌లో ఒకరిగా కార్తీక్ ఆర్య‌న్ ను ఎంపిక చేయగా… మ‌రో కొత్త హీరోను ప‌రిచ‌యం చేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తెలిపారు. “దోస్తానా”లో ప్రియాంక చోప్రా గోల్డెన్ బికినీ వేసినట్టు, జాన్వీ కూడా సీక్వెల్‌లో సముద్ర తీరాన సెగలు పుట్టిస్తుందట. “దోస్తానా-2″కు జాన్వీ గ్లామర్ ఎంతగా ప్లస్ అవుతుందనేది. క‌ర‌ణ్ జోహాన్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో జాన్వీక‌పూర్ చేస్తోన్న మూడో చిత్ర‌మిది. ఇక జాన్వీ కపూర్ “కార్గిల్ గర్ల్” అనే చిత్రంతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Related posts