telugu navyamedia
క్రైమ్ వార్తలు

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్‌ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీని బ‌స్సు ఢీకొట్టింది.
దీంతో లారీని, బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. లారీ లో ఉన్న ఇద్దరు, బస్సులోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Related posts