మాస్ మహారాజా రవితేజ హీరోగా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.
ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ ఉదమే అనౌన్స్ చేశారు. అలాగే అదే రోజు సినిమాకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టుగా చెప్పారు.
అలాగే ఈ సినిమాలో కథానాయికగా నుపూర్ సనన్ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నుపూర్.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు కావడం విశేషం. ఈ చిత్రంతోనే నుపుర్ సనన్ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుంది.
టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో ‘ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్’ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరగనుంది.