telugu navyamedia
క్రైమ్ వార్తలు

గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు.

వివ‌రాల్లోకి వెళితే..

గుంటూరులో పుట్టిన రోజు వేడుకలకు జ‌రుపుకుని తిరిగి ప‌య‌నంలో అర్థరాత్రి విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో.. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో చోటు చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పెనుమాకకు చెందిన షేక్ పై కంబర్, షేక్ రాజా, సతీష్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. యువకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts