telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైద‌రాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఘోర ప్ర‌మాదం..

హైద‌రాబాద్ నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కింద పడి మురళీ కృష్ణ అనే జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వివ‌రాల్లోకి వెళితే..

స్కూటీ మీద వెళ్తున్న మురళీ కృష్ణ.. బస్సు వెనుక చక్రం కింద పడటంతో ఘోరం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న సోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మురళి కృష్ణ ఐడీ కార్డు చూడగా జీహెచ్ఎంసీ ఐడీ కార్డు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ..డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, మురళీ కృష్ణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Related posts