ఫేస్బుక్లో పరిచయంతో నమ్మి యువకుడితో కలిసి హైదరాబాద్కు వచ్చిన ఓ బాలిక చివరకు భయంతో తిరిగి ఇంటికి చేరిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. వినోద్ అనే వ్యక్తికి ఓ బాలికతో పేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆ వ్యక్తి మాయమాటలు చెప్పి… బాలికను బయటకు వెళ్దామని చెప్పి పలుమార్లు కలుసుకున్నారు. ఇదే అదునుగా భావించిన యువకుడు హైదరాబాద్ చూపిస్తానని చెప్పాడు. బాలిక ఇంట్లో చెప్పకుండానే యువకుడితో కలిసి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత భయాందోళనకు గురైన బాలిక… తాను ఇక్కడ ఉండలేనంటూ కేకలు వేసింది. దీంతో.. అక్కడ నుంచి ఇద్దరు తిరిగి విశాఖకు వచ్చేశారు. ఈ విషయంపై బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. విషయం బయటపడటంతో బాలిక తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్పై కిడ్నాప్ కేసు నమోదు చేసి… అరెస్ట్ చేశారు.