telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసు : మరోసారి ఈడీ విచారణకు హాజరైన రియా

Rhea

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారింది. ఇప్పటికే అతని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి? అంతకుముందు ఏం జరిగింది? అనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఈ కేసు విషయమై సీబీఐ, ఈడీ కూడా ఎంటరై ఎంక్వైరీలు మొదలు పెట్టాయి. ఇక ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదురుకుంటున్న రియా చక్రవర్తి సోమవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమె తన సోదరుడు సౌవిక్ చ‌క్ర‌వ‌ర్తితో కలిసి ముంబై లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రియాపై ప్రశ్నల వర్షం కురిపించడానికి అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం మొదటిసారి రియా ఈడీ ముందు హాజరు కాగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. సుశాంత్ వద్ద కేవలం వాటర్ బాటిల్ మరియు లెటర్ మాత్రమే తీసుకున్నానని ఆమె సమాధానమిచ్చింది. రియా సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందలేదు. ఇక ఇదే కేసులో అధికారులు రియా సోదరుడు సౌవిక్ చ‌క్ర‌వ‌ర్తి ని సైతం విచారించారు. అతడిని 18 గంటలపాటు విచారించారు.

Related posts