యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మార్చి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. కాగా.. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది. అటు ‘భలేగుంది బాల’సాంగ్ ఏడు మిలియన్ల వ్యూస్ను సంపాదించుకుంది. ఇంత తక్కువ సమయంలో ఏడు మిలియన్ల వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
previous post