ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావో’ఆందోళన ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో వ్యవస్థలను నాశనం చేశారు.
ఆర్థిక మాంద్యం దేశాభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్తోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాచరిక పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారు. రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని ఆరోపించారు.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్