telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డీఎస్సీ-2008 పై త్వరలో నిర్ణయం: మంత్రి సురేశ్

suresh adimulapu minister

డీఎస్సీ-2008కి సంబంధించి ఉద్యోగాల భర్తీలో సమస్యలు ఉన్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ ద్వారా ఎంపికైన 4657 మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి స్పందించారు. అభ్యర్థుల పైలును న్యాయవిభాగానికి పంపించామని వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. మరికొన్నిరోజుల్లో టెట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సంవత్సరం ఫీజుల నియంత్రణ అమలు చేయాలేకపోయామని వివరించారు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల అడ్మిషన్లు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. విద్యాసంస్థల ఫీజులను డిసెంబరు చివరిలోగా కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు.

Related posts