telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారుకు ప్రమాదం.. భార్య మృతి..!

కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌కు ఇవాళ ప్రమాదానికి గురయ్యారు. అతడు, అతడి భార్య కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయింది. ఈ ఘటన ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్‌లోని అంకోలా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం శ్రీపాద్ నాయక్, అతడి భార్య పరిస్తితి విషమంగా ఉంది. వీరు గోకర్ణా నుంచి వస్తున్న దారిలో వారి కారు ప్రమాదానికి గురైంది. వెంటనే అక్కడి స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే… ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి భార్య మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన తెలియరాలేదు. . అయితే అక్కడి స్థానిక పోలీసులు యాక్సిడెంట్ కేసును నమోదు చేశారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శవంత్‌తో మాట్లాడారు. యూనియన్ మినిస్టర్ శ్రీపాద్ నాయక్ దంపతుల చికిత్సకు కావలసిన సదుపాయాలను అమర్చాలని కోరారు.

Related posts