telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరాం..!

Kodandaram

తెలంగాణలో వచ్చే ఏడాది పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలోకి దిగాలని ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. కోదండరాం నేతృత్వంలో నిన్న నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది.

వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి కోదండరాం బరిలోకి దిగితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. నిర్ణయం ఏదైనా సమష్టిగా తీసుకోవాలని కోదండరాం పేర్కొన్నారు. ఈ విషయ్హంపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. అలాగే, ఇతర పార్టీల నేతలు, సంఘాల నేతల మద్దతు సేకరించాలని కోరారు. దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దానిపై నివేదిక తయారుచేసేందుకు కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Related posts