telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్

chandrababu

ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ) ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మండిపడ్డారు. ‘వీళ్లకి కనీస ఇంగిత జ్ఞానం ఉందా? మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. డబ్బులు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థ ఏది పడితే అది రాసివ్వకూడదన్నారు.

హుద్ హుద్ కి ముందు తర్వాత విశాఖలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ గమనించాలన్నారు. అమరావతిలో రాజధాని కట్టడానికి ఖర్చు ఎక్కువవుతుందని అంటున్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తారా?’ అని ప్రశ్నించారు. వీళ్లకేమైనా తలాతోకా ఉన్నాయా? బీసీజీకి జగన్ రాసిస్తే అదే విషయాన్ని రాసి ఇచ్చింది. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని అభివృద్ధి ఎలా చేయాలో వేసిందే నారాయణ కమిటీ అని తెలిపారు. ఇప్పుడు ఆ కమిటీపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

విశాఖ లో 17 లక్షల జనాభాతో ఉంది. అదే అమరావతిలో అన్ని గ్రామాలు, నగరాలు కలుపుకుంటే 22 లక్షల జనాభా ఉంది. సౌతాఫ్రియా, జర్మనీల్లో మూడు రాజధానులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటనల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల వల్ల నష్టం జరిగిందని సౌతాఫ్రికా నేతలే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు.

Related posts