telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెట్లో చిరాగ్గా… అయినా తప్పదు : జాన్వీ కపూర్

Jahnavi-Kapoor

జాన్వీ క‌పూర్‌. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రైజింగ్ హీరోయిన్ అంటే జాన్వీ కపూర్ పేరు తప్పక వినిపిస్తుంది. బ్యూటిఫుల్ లెజెండ్రీ లేడీ శ్రేదేవి వారసురాలిగా పరిశ్రమలోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే హిందీ పరిశ్రమలో టాప్ లీగ్‌లో స్థానం దక్కించుకుంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో తళుక్కుమంది. అయితే ఈ సిరీస్‌ విడుదల సందర్భంగా జాన్వీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘోస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో ఓ సెగ్మెంట్‌లో జాన్వీ నర్స్ పాత్ర పోషించింది. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్‌ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై పాజిటివ్ రివ్యూస్ దక్కించుకుంది. అయితే ఇందులో కాస్ట్యూమ్స్ విషయంలో జాన్వీ బాగా ఇబ్బంది పడిందట. “ఘోస్ట్ స్టోరీస్ లో నర్స్ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. అయితే నర్స్ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ వల్ల చెమటలు పట్టేసి సెట్లో చాలా చిరాకుగా అనిపించేది. అయినా ఓ మంచి పాత్ర కోసం ఇలాంటివి తప్పదు” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.

Related posts