telugu navyamedia
సినిమా వార్తలు

ఇలా జరుగుతుందని ఎన్టీఆర్ కలలోకి వచ్చి చెప్పారు… ఇప్పుడు బాబు పరిస్థితి ఇది : వర్మ

RGV

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, టీడీపీ 23 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ ఓటమిపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్థ్రాలు సంధిస్తున్నారు. “‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపేసినందుకే చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నిన్న రాత్రి తన కలలోకి వచ్చి చెప్పారు” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

అంతేకాదు చంద్రబాబును పోలిన వ్యక్తి హోటల్ లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేస్తూ..ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఇదీ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర కోసం సరిపోయే వ్యక్తి దొరికాడని, వర్మ గతంలో షేర్ చేసిన వీడియోనే తాజాగా మరోసారి ట్వీట్ చేసి బాబుపై సెటైర్లు వేశాడు. సైకిల్ టైర్ పంక్చర్ అయిందని, పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారని వర్మ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

Related posts