సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం “ఎన్.జి.కె”. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్కి అందించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… “శ్రీ రాఘవగారికి నేను పెద్ద ఫ్యాన్ని. నేను స్కూల్ అయిపోయిన తర్వాత కన్నడలో ఓ సినిమా చేశాను. అదే 7బైజి బృందావన కాలనీ రీమేక్. అప్పటి నుంచి శ్రీ రాఘవసార్తో పనిచేయాలని ఉంది. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఇది. సీరియస్ రోల్ చేశాను. సినిమా కోసం ఎగ్జయిటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. సూర్య గారు అమేజింగ్, ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనతో పని చేయడం హ్యాపీ. ఈ సినిమాకు యువన్ శంకర్గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఎంటైర్ యూనిట్కు థ్యాంక్స్. మే 31న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.
మీటూ ఆరోపణల వల్ల అవకాశాలు దూరం : తమన్నా