ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. జూన్ 20న అనారోగ్యంతో ముంబయిలోని ఓ హాస్పిటల్లో చేరిన ఆమె… చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత పది రోజులుగా గురు నానక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే సరోజ్ ఖాన్ సరోజ్ఖాన్ తన ఇన్స్టాగ్రామ్లో చివరిసారి చేసిన పోస్టు అందరినీ ఉద్వేగానికి గురిచేస్తోంది. బాలీవుడ్లో ‘మాస్టర్ జీ’, ‘మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ’ అని ప్రేమగా పిలిచే సరోజ్ ఖాన్ మరణించే ముందు చివరిసారిగా జూన్ 14వతేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై ఇన్స్టాగ్రామ్ పోస్టు పెట్టారు‘‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ సుశాంత్, నేను చాలాసార్లు కలుసుకున్నాం. మీ జీవితంలో ఏం తప్పు జరిగింది? మీరు మీ లైఫ్లో ఇంత తీవ్రమైన అడుగు వేసినందుకు నేను షాక్ అయ్యాను.దేవుడు మీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక…మీ తండ్రి, సోదరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సమయంలో వారికి సంతాపం తెలుపుతున్నాను. నేను మీ అన్ని సినిమాల్లోనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను.’’ అంటూ సరోజ్ ఖాన్ సుశాంత్ మృతి పట్ల తన సంతాపం తెలిపారు. సుశాంత్ మరణం పట్ల సంతాపం తెలిపిన 20 రోజుల్లోపే సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించడంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్తోపాటు దక్షిణాదిలో ఎన్నో చిత్రాలకు సరోజ్ఖాన్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. 2,000కుపైగా పాటలకు నృత్యరీతులను సమకూర్చారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు.
previous post