telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ భయం.. ఏపీకి తరలుతున్న జనం!

traficc border

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీ వాసులు స్వస్థలాలకు ప్రయాణం అవుతున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున సరిహద్దు దాటుతున్నారు. దీంతో సరిహద్దుల వద్ద సందడి నెలకొంది. ‘స్పందన’, ‘ఈ-పాస్’ ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన అనంతరం అధికారులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

అనుమతి పత్రాలు లేని వారిని మాత్రం అధికారులు వెనక్కి పంపుతున్నారు.థర్మల్ స్క్రీనింగ్ అనంతరం చేతిపై ‘హోం క్వారంటైన్’ ముద్ర వేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే వీరిని అనుమతిస్తున్నారు.

మరోవైపు, ఈ-పాస్‌లు ఉన్నవారే రాష్ట్రానికి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, గత నెల 24 నుంచి 26 మధ్య రోజుకు సగటున 800 మంది ఏపీకి రాగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యి దాటింది. 29న 1,044 మంది రాష్ట్రానికి రాగా, 30న 1,088 మంది, ఈ నెల 1న 1,130 మంది ఏపీలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు.

Related posts