కరోనాపై జాగ్రత్తలు చెబుతూ ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ ఓ పాటను విడుదల చేసింది. దీనికి జనసేన కరోనా వైరస్ అవేర్నెస్ సాంగ్ అని పేరు పెట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత ప్రియాంక రాశారు. మేఘారాజ్ ఆలపించారు. ఈ బృందానికి పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ‘కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న “గబ్బర్ సింగ్” సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ “మేఘా రాజ్”, ఎడిటర్ “వేణు” మ్యూజిక్ డైరెక్టర్ “శ్రీ కోటి” గీత రచయిత “ప్రియాంక” గార్లకు, ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్లు చేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనాపై పాటలు పాడి జాగ్రత్తలపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా నటులు డ్యాన్స్ చేసిన ఈ పాట వైరల్ అవుతోంది.
కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న “గబ్బర్ సింగ్” సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ “మేఘా రాజ్”, ఎడిటర్ “వేణు”
(Cont..)— Pawan Kalyan (@PawanKalyan) April 17, 2020