telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సెటైరికల్ పోస్ట్

Srireddy-and-Pawan-Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి టార్గెట్ చేసింది. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకతోపాటు భీమవరం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఊపు తేవడం కోసం ఆయన భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా పవన్ ఇక్కడి నుంచి పోటీకి దిగడానికి కారణమైందని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో భీమవరం హాట్ టాపిక్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఆయన భీమవరంలో పాటు గాజువాకలో కూడా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇక సినిమాలు చేసుకుంటాడని అంతా అనుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయాలు వదిలే ప్రసక్తే లేదని తేల్చేసారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టేందుకు వ్యూహరచనలు చేస్తూ అధికార పార్టీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో “100 రోజుల టైం ఇస్తున్నా.. ఆ తరువాత నా ప్రతాపం” చూపిస్తా అంటూ ప్రభుత్వానికి లేఖ రాశాడు పవన్. పవన్ తీరు చూసిన శ్రీరెడ్డి వెంటనే ఆయనపై ఎటాక్ చేస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టేసింది. ”కనీసం అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీకు… నీకు నాకు పెద్దగా పని లేదు కదా… వచ్చి కూర్చొని సొల్లు చెప్పుకుందాం” అంటూ సెటైరికల్‌ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఇక పవన్ పై కత్తి మహేష్ కూడా ఇలాగే సెటైరికల్ పోస్ట్ చేయడంతో పవన్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు.

Related posts