ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఇటీవల చిరంజీవి ప్రధాన పాత్రలో “సైరా” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు సురేందర్ రెడ్డి. అతి తక్కువ సమయంలోనే మంచి డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ దర్శకుడు తన తరువాత సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాడట. యాక్షన్ థ్రిల్లర్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుండగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. గతంలో బన్నీతో “రేసు గుర్రం” సినిమా తీసి సురేందర్ రెడ్డి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
previous post