బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ తన తండ్రి విలాస్రావ్ దేశ్ ముఖ్ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దానిలో “హ్యాపీ బర్త్ డే పాపా, ఐ మిస్ యూ” అని పోస్ట్ చేస్తూ ఒక ఫోటోను కూడా జత చేశారు. కాగా విలాస్ రావ్దేశ్ ముఖ్ రెండు దఫాల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012 ఆగస్టు 12న ఆయన కన్నుమూశారు. రితేష్ దేశ్ముఖ్ భార్య, నటి జనీలియా కూడా తన మామ విలాస్రావ్ దేశ్ముఖ్ను తలచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అందులో జెనీలియా “మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో, వారు మనకు దూరంగా వెళ్లలేరు. వారు ప్రతినిత్యం మనతోపాటే ఉంటారు. కంటికి కనిపించరంతే. వారి మాట వినిపించకపోయినా, సమీపంలోనే ఉంటారు. హ్యాపీ బర్త్ డే పాపా” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు జెనీలియా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను జతచేసి షేర్ చేశారు.
previous post
వీడియో బయటపెట్టేముందు కాస్త ఆలోచించి పెట్టండి..