telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

Lagadapati Telangana Elections Result

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని లగడపాటి తప్పుడు సర్వే వలన అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో తేల్చానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసు అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Related posts