మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
కాగా..సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై నరేష్ చేసిన కామెంట్స్పై హీరో శ్రీకాంత్ త్రీవంగా మండిపడ్డారు.సాయిధరమ్ తేజ్ది చాలా చిన్న ప్రమాదం ..అది కామన్గా జరిగేది..ఆ రోడ్డు మీద ఇసుక ఉండడంతో స్కిడ్ అయ్యి పడిపోవడం జరిగింది. అతను త్వరగా కోలుకుంటారు..కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ దేవుడును ప్రార్ధిస్తున్నాను అని శ్రీకాంత్ అన్నారు.
అలాగే దయచేసి ఎవ్వరూ కూడా వీడియో బయటపెట్టేముందు కాస్త ఆలోచించి పెట్టండి ..నాకు తెలిసి యంగ్స్టార్స్లో చాలా తెలిసిన వ్యక్తి, అతను గురించి నాకు బాగా తెలుసు ..ర్యాష్ డ్రైవింగ్లు గాని, ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు..అటువంటి వ్యక్తి గురించి ఈ టైమ్లో ఇలా మట్లాడం మంచిది కాదు. కుటుంబ సభ్యులందరూ చాలా టెన్ష్న్గా ఉన్నారు.
ఇటువంటి సమయంలో మన పెట్టే బైట్లు ఆ కుటుంబానికి మరింత టెన్స్న్ వాతావరణం క్రియేట్ చేసినట్టు ఉంది. దయ చేసి నరేష్గారు పెట్టిన బైట్ నాకు నచ్చలేదు. అది కాకుండా చనిపోయిన వారి గురించి ఎత్తకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. అందుకని దయచేసి ఇటువంటి వీడియోలు ఎవ్వరూ పెట్టోద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాని శ్రీకాంత్ అన్నారు.
కాగా అంతకు ముందు సాయిధరమ్ తేజ్ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని, వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారని ఈ మేరకు నటుడు నరేశ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.