telugu navyamedia
సినిమా వార్తలు

2000 మంది ‘అఘోరాలస‌తో ‘ఎర్రచీర’ షూటింగ్ పూర్తి ..

కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ ‘మ‌హాన‌టి’ ఫేం బేబి సాయి తేజ‌స్వి  ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్న సినిమా ‘ఎర్రచీర’.  సి.హెచ్ వీ సుమన్‌ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతుంది.

ఈ సినిమా హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సౌత్ ఇండియా సినిమాగా రూపొందుతోంది.  ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ అఖండ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మాట్రిక్స్ సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుంది. 30 నిముషాల ఈ కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసే పనిలో గ్రాఫిక్స్ టీం తలమునకలు అయింది.

 

తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన అయ్యప్ప పి శర్మ మరియు రెండు వేల మంది అఘోరాలతో క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. ఈ క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక గ్రాఫిక్స్ పార్ట్ లేట్ కావడంతో సినిమా విడుదల కూడా కొంచెం లేట్ అయ్యింది. ఇక గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుని రాత్రికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related posts