మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో కొద్ది రోజులుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని 2020 ఏప్రిల్లో విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తున్నారని చెబుతున్నారు.
previous post
next post