తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 40వ సినిమా ‘జగమే తంత్రం’. ఈ సినిమాను తమిళంలో ‘జగమే తంతిరమ్’ పేరుతో రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై శశికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వెంకట్ కాచర్ల డైలాగ్స్ రాస్తున్నారు. సంతోశ్ నారాయణన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుండి మంగళవారం ‘రకిట రకిట..’ అనే సాంగ్ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. భాస్కరభట్ల సంగీతం అందించారు.