telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎనిమిది గంటలపాటు .. చంద కొచ్చర్‌ దంపతుల విచారణ..

chandakochar attended before ED

ఈడీ అధికారులు వీడియోకాన్ కు రుణమిచ్చిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ లను సుమారు 8 గంటల పాటు విచారించారు. సరైన పత్రాలు లేకుండా రుణాలివ్వడం, మనీ లాండరింగ్‌ తదితర ఆరోపణలపైనే విచారణ సాగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కొచ్చర్ దంపతులు, ముందుగానే ఈడీ ఆఫీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

రాత్రి 8 గంటల తరువాత వీరిద్దరూఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. కొచ్చర్ దంపతులు తామెదుర్కొన్న ప్రశ్నలకు అధికారులు సంతృప్తి చెందేలా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఏ విషయాలపై వారిని ప్రశ్నించారో బహిర్గతం కానప్పటికీ, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద వీరి వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసినట్టు తెలుస్తోంది. నేడు సైతం కొచ్చర్‌ దంపతులను ఈడీ ప్రశ్నించ వచ్చని తెలుస్తోంది.

Related posts