తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయం కూల్చివేసి నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్లతో అత్యాధునిక స్థాయిలో సరికొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ పిటిషన్ ను స్వీకరించిన తెలంగాణ హై కోర్ట్ రేపు విచారణ చేపట్టనుండి.