ఎట్టకేలకు సునంద పుష్కర్ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, నేత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఢిల్లీ సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. శశిథరూర్పై ఉన్న అభియోగాలను స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. ఈకేసులో ఆయన నిర్దోషిగా ప్రకటించింది.
కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో హోటల్ గదిలో శవమై కనిపించింది. సునంద డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య నివేదిక సూచిచింది. సునంద కేసు ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో విచారణ జరిపిన పోలీసులు చివరకు ఆత్మహత్యాయత్నగా శశిథరూర్ పై కేసు నమోదు చేసి చార్జీషీట్ సమర్పించారు. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు డిశ్చార్జ్ చేసింది.
ఐపీసీ సెక్షన్ 498 ఎ వైవాహిక క్రూరత్వం మరియు 306 ఆత్మహత్యకు ప్రేరణ సెక్షన్ల కింద ఈ కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. చార్జిషీట్లో కూడా చేర్చారు.ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు డిశ్చార్జ్ చేసింది.