telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్పీకర్‌ పోచారంకు మాతృవియోగం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. పోచారం తల్లి పరిగే పాపవ్వ(107) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన పరిగె పాపవ్వ భర్తపేరు పరిగె రాజిరెడ్డి. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందులో మూడో సంతానం పోచారం శ్రీనివాసరెడ్డి.

తన రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలకు శ్రీకారం చుట్టబోయే ముందు పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బాన్సువాడకు చేరుకున్నారు. బుధవారం బాన్సువాడలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. స్పీకర్ పోచారం తల్లి మృతి పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం తెలిపారు. 

Related posts