telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇటలీలో ఆంక్షలు సడలించిన ప్రభుత్వం: వైద్యాధికారులు ఫైర్

Italy corona virus

కరోనా దెబ్బకు ఇటలీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12,428 మరణాలు సంభవించాయి.నిన్న ఒక్క రోజే ఆ దేశంలో 1,648 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలాంటి భయానకర పరిస్థితుల్లో ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలపాలవుతోంది. ప్రజలపై విధించిన ఆంక్షలను ఆ దేశం సడలించింది. పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో నడకకు తీసుకెళ్లొచ్చని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై అక్కడి వైద్యాధికారులు మండిపడుతున్నారు.

మిలాన్ ప్రాంతానికి చెందిన హెల్త్ చీఫ్ గిలియో గల్లెరా ఈ సందర్భంగా స్పందిస్తూ… ప్రభుత్వ నిర్ణయం హస్యాస్పదంగా ఉందని అన్నారు. వైరస్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు సరికావనిఅన్నారు. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితి మరింత అదుపుతప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts