telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్ సరసన వెంకటేష్ హీరోయిన్…

తెలుగులో యమదొంగ, చింతకాయల రవి లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది మమతా మోహన్ దాస్. నటిగానే కాకుండా గాయినిగాను ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకుంది. యమదొంగ చిత్రంతో మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆలాగే వెంకటేష్ సరసన చింతకాయల రవి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిమెప్పించింది. ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మమతా మోహన్ దాస్ కు సక్సెస్ దక్కలేదు. 2009లో వచ్చిన కేడి తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ చిన్నది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడిన మమతా మోహన్ దాస్.. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ ను జయించి బయటపడింది . అదే సమయంలో పెళ్ళైన ఏడాదికే భర్తతో విడిపోయింది. ఆతర్వాత మమత మలయాళ సినిమాలు కన్నడ సినిమాలు చేస్తుంది. తాజాగా హాట్ బ్యూటీ తెలుగు రీఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాలో  హీరోయిన్ గా సింగర్ కమ్ యాక్టర్ మమతా మోహన్ దాస్ ని సంప్రదిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

Related posts